కోడెల ఆత్మహత్యపై హైకోర్టులో

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 16న [more]

Update: 2019-09-20 08:55 GMT

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 16న హైద్రాబాద్‌లోని తన నివాసంలో కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని అనిల్ బూరగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

కొడుకే కాలయముడు?

పిటిషనర్ అనిల్ బూరగడ్డ ఏపీ మాజీ శాసనసభాపతి కోడెలది ఆత్మహత్య కాదని, ఆయన కొడుకు శివరామ కృష్ణే మానసికంగా వేధించి హత్య చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి పేర్కొన్నారు. అనేక నేరాలు చేసిన శివరాం కేసుల నుంచి తప్పించడం కోసం తండ్రిని హత్య చేసాడని ఆరోపిస్తూ సీబీఐ విచారణ కోరుతూ పిల్ దాఖలు చేశారు. సీబీఐ , తెలంగాణ ప్రభుత్వం , బంజారాహిల్స్ సీఐ ని ప్రతివాదులు గా చేర్చారు.

 

Tags:    

Similar News