బ్రేకింగ్ : ప్రమాదంలో ఏడుగురి మృతి.. విచారణకు జగన్ ఆదేశం

విజయవాడ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మృతులందరూ కరోనా [more]

Update: 2020-08-09 02:54 GMT

విజయవాడ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మృతులందరూ కరోనా రోగులే. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ సెంటర్ గా మార్చింది. దాదాపు నలభై మంది కరోనా రోగులకు అందులో చికిత్స అందిస్తున్నారు. పది మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సంభవించగానే నలుగురు భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై జగన్ ఆరా తీశారు. ప్రమాదంపై విచాణకు ప్రభుత్వం ఆదేశించింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News