కుట్రలలోనే చంద్రబాబు కాలం గడుపుతారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిత్యం కుట్రలతోనే కాలం గడుపుతారన్నారు. గత పదేళ్లుగా జగన్ పై [more]

Update: 2021-06-24 12:56 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిత్యం కుట్రలతోనే కాలం గడుపుతారన్నారు. గత పదేళ్లుగా జగన్ పై చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా జగన్ పై దాదాపు 30 కేేసులు పెట్టారన్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగు చూసిన తర్వాతనే ఈ కేసులు నమోదయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలపై పెట్టిన కేసులు కొట్టివేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఎల్లోమీడియా జగన్ పై కేసులు కొట్టివేసుకున్నారంటూ విష ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు.

Tags:    

Similar News