తగ్గని కేసీఆర్

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఈరోజు ఉదయం 10.30గంటలకు ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నుంచి [more]

Update: 2019-10-19 04:32 GMT

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఈరోజు ఉదయం 10.30గంటలకు ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు. తెలంగాణ బంద్ లో ఆర్టీసీ కార్మికసంఘాలు యధాతధంగా పాల్గొంటున్నాయి. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అయితే హైకోర్టు విధించిన డెడ్ లైన్ కూడా ముగియనుండటంతో ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. కేసీఆర్ మాత్రం చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆర్టీసీ అధికారులతో చెప్పినట్లు తెలిసింది. కేసీఆర్ వెనక్కు తగ్గకపోవడంతో ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.

Tags:    

Similar News