అదరలేదు… బెదరలేదు

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 వేల మంది కార్మికులున్న ఆర్టీసీలో కేవలం 373 మంది [more]

Update: 2019-11-06 03:41 GMT

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 వేల మంది కార్మికులున్న ఆర్టీసీలో కేవలం 373 మంది మాత్రమే విధుల్లో చేరారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి వచ్చిన లెక్కల ఆధారంగా కార్మికులు అతి తక్కువ సంఖ్యలో తమ విధుల్లో చేరారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి. తమకు న్యాయస్థానం ఉందని, అక్కడే తేల్చుకుంటామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5 వేల రూట్లను ప్రయివేటు పరం చేస్తానని కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News