కరీంనగర్ జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి

Update: 2018-05-29 06:28 GMT

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందాడు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను తీసేందుకు స్థానికులు, పోలీసులు యత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వ్యైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చెంజర్ల బస్సు ప్రమాదం పై మంత్రి ఈటల దిగ్బంత్రి వ్యక్తంచేశారు. ఆయన ప్రమాదస్థలికి చేరుకుని బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు.

Similar News