బాబు గోగినేనికి హైకోర్టులో ఊరట లభించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై తదుపరి దర్యాప్తు రెండు నెలల పాటు నిలిపి వేయాలని హైకోర్టు అదేశించింది. బిగ్ బాస్ 2 షోకు వెళ్లి నోటిసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో బాబు గోగినేని న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుండటంతో పాటు తన సమావేశాలకు వచ్చిన జనం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆధార్కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని అతనిపై మాదాపూర్కు చెందిన వ్యాపారవేత్త వీరనారాయణ ఫిర్యాదు చేశారు.
ఆధార్ నెంబర్లను సేకరించారు...
హేతువాది, మానవతావాదిగా చెప్పుకొంటున్న రాజాజీ రామనాథ బాబు గోగినేని ఇటీవల వైజాగ్, హైదరాబాద్, బెంగళూరుల్లో నిర్వహించిన నేషనల్ డే ఆఫ్ హ్యూమనిజం, హ్యూమనిస్ట్స్ గెట్ టు గెదర్ సమావేశాలకు వచ్చిన వారి ఆధార్ కార్డు నెంబర్లు సేకరించారు. ఇది ప్రభుత్వ యుఐడీఏఐ నిబంధనలకు విరుద్ధమని, బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవాలని వీరనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.