బ్రేకింగ్ : ఆ ఎన్నికకు షెడ్యూల్

రాజ్యసభ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 55 స్థానాలకు గాను రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 26వ [more]

Update: 2020-02-25 05:12 GMT

రాజ్యసభ ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 55 స్థానాలకు గాను రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 26వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండింటికి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు స్థానాలను రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ మాత్రమే కైవసం చేసుకుంటుంది. కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహనరావు, కె.కేశవరావు, తోట సీతామహాలక్ష్మి, టి. సుబ్బరామిరెడ్డి, ఎంఎ ఖాన్ లు పదవీ విరమణ చేయనుండటంతో ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరూ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒక్క కె.కేశవరావుకు మాత్రమే రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News