కిక్కిరిసిపోయిన రైల్వే స్టేషన్లు.. పదిహేను రోజుల పాటు

మహారాష్ట్రలో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్రలో పదిహేను రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించడంతో వలస కూలీలు మళ్లీ సొంత ఊళ్ల బాట పట్టారు. మహారాష్ట్ర [more]

Update: 2021-04-15 01:28 GMT

మహారాష్ట్రలో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మహారాష్ట్రలో పదిహేను రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించడంతో వలస కూలీలు మళ్లీ సొంత ఊళ్ల బాట పట్టారు. మహారాష్ట్ర ఈ నెలాఖరు వరకూ జనతా కర్ఫ్యూ విధించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సెలవును ప్రకటించింది. హోటల్స్, మాల్స్ ను కూడా బంద్ చేశారు. దీంతో వలస కూలీలు ముంబయి మహా నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను మొహరించి పోలీసులు ప్రయాణీకులను కట్టడి చేస్తున్నారు.

Tags:    

Similar News