హైదరాబాద్ కి వచ్చి పోయిన రాహుల్ గాంధీ

Update: 2018-08-13 07:34 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ఆయన శంషాబాద్ కు రానున్నారు. ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికి శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ కి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే, ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో శంషాబాద్ చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి వెంటనే హెలికాఫ్టర్ లో బీదర్ వెళ్లిపోయారు. అక్కడ జరిగే సభకు హాజరై తిరిగి ఆయన శంషాబాద్ కి రానున్నారు.

Similar News