జీవీఎల్ వ్యాఖ్యలు అర్థం లేనివి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అభిప్రాయాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పు పట్టారు. అన్ని రాష్ట్రాల్లో [more]

Update: 2020-08-20 06:46 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అభిప్రాయాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పు పట్టారు. అన్ని రాష్ట్రాల్లో లాగానే కేంద్ర ప్రభుత్వం ఏపీలోనూ వ్యవహరిస్తుందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. జీవీఎల్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. జాతీయ పార్టీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉండదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వినాయక మండపాలకు ఏపీ లో అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

Tags:    

Similar News