రాజుగారిపై వరస ఫిర్యాదులు.. వరస కేసులు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వరసగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రఘురామ కృష్ణంరాజుపై భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. [more]

Update: 2020-07-09 06:11 GMT

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వరసగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రఘురామ కృష్ణంరాజుపై భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను రఘురామ కృష్ణంరాజు దూషించారని ఫిర్యాదులో గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీలో వైషమ్యాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు భంగం కల్గించే విధంగా రఘురామ కృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి రంగనాధరాజు రఘురామ కృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News