బ్రేకింగ్ : రాజుగారిపై రేపు అనర్హత పిటీషన్

నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడానికి వైసీపీ రెడీ అవుతుంది. రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు అనర్హత పిటీషన్ [more]

Update: 2020-07-02 08:47 GMT

నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడానికి వైసీపీ రెడీ అవుతుంది. రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు అనర్హత పిటీషన్ ను అందచేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆరుగరు ఎంపీలను ఇప్పటికే వైసీపీ ఢిల్లీ పంపినట్లు సమచారం. ఈ ఆరుగురు ఎంపీలు రేపు స్పీకర్ ను కలసి రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో స్పీకర్ కు అందచేయనున్నారు. రఘరామ కృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేయకుండా అనర్హత వేటు వేయాలన్నదే వైసీపీ ఆలోచన.

Tags:    

Similar News