జగన్ కు రాజుగారి ఆరు పేజీల లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు లేఖ రాశారు. ఆరుపేజీల లేఖను రఘురామకృష్ణంరాజు రాశారు. తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని లేఖలో [more]

Update: 2020-06-29 06:52 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు లేఖ రాశారు. ఆరుపేజీల లేఖను రఘురామకృష్ణంరాజు రాశారు. తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని లేఖలో ఆయన పేర్కొన్నారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను తాను ఏనాడు థిక్కరించలేదని పేర్కొన్నారు. మీ నాయకత్వాన్ని సమర్థిస్తానని పేర్కొన్నారు. తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. సీ ఓటరు సర్వేలో ముఖ్యమంత్రిగా నాలుగో స్థానం రావడంపై ఆయన అభినందనలు తెలిపారు. మొదటి స్థానానికి రావాలని ఆయన ఆకాంక్షించారు. కాగా జగన్ కు లేఖ పంపే ముందు రఘు రామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలంగా ఒక పాటను విడుదల చేశారు. చైనాతో యుద్దం వస్తే ఖచ్చితంగా మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తామన్న పాటను రఘురామకృష్ణంరాజు విడుదల చేశారు.

Tags:    

Similar News