Raghurama : ఆ డ్రగ్స్ సంగతేంటో… ఎవరిదో?

డ్రగ్స్ మాఫియాపై జగన్ స్పందించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వేల కోట్ల హెరాయిన్ విజయవాడకు దిగుమతి అవుతుంది అంటే దీని వెనక ఎవరున్నారన్నది చెప్పాలని [more]

Update: 2021-09-21 07:58 GMT

డ్రగ్స్ మాఫియాపై జగన్ స్పందించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. వేల కోట్ల హెరాయిన్ విజయవాడకు దిగుమతి అవుతుంది అంటే దీని వెనక ఎవరున్నారన్నది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ ను రాష్ట్రం కోసం పణంగా పెట్టవద్దని రఘురామ కృష్ణరాజు అన్నారు. హెరాయిన్, డ్రగ్స్ లింకుల్ని ఛేదించాలని ఆయన కోరారు. సినిమా టిక్కెట్లపై కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. సామాన్యుడి వినోదం పేరిట ఆటాడుకోవద్దని రఘురామ కృష్ణరాజు కోరారు. 1200 కోట్ల టర్నోవర్ ఉన్న సినిమారంగాన్ని నాశనం చేయవద్దని రఘురామ కృష్ణరాజు కోరారు.

Tags:    

Similar News