భవిష్యత్ ను తలచుకుంటేనే భయమేస్తుంది

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాను వివరించానని చెప్పారు. రాష్ట్రం పూర్తిగా [more]

Update: 2021-08-09 08:29 GMT

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాను వివరించానని చెప్పారు. రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్దారు. తాను మోదీకి కూడా లేఖ రాశానని, దీనిపై మోదీ వివరణ అడిగారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కు మించి 142 శాతానికి పైగా ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందని రఘురామ కృష్ణరాజు చెప్పారు. ప్రస్తుతం ఏపీ ఆదాయంలో 42 శాతం అప్పులకు వడ్డీ చెల్లించడానికే సరిపోతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను తలచుకుంటే భయమేస్తుందని రఘురామ కృష్ణరాజు అన్నారు.

Tags:    

Similar News