అంతు చూస్తానని నన్ను బెదిరించాడు

హిందూపురం పార్లమెంటుసభ్యుడు గోరంట్ల మాధవ్ పై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ఆవరణలో గోరంట్ల మాధవ్ తనపై [more]

Update: 2021-08-03 12:01 GMT

హిందూపురం పార్లమెంటుసభ్యుడు గోరంట్ల మాధవ్ పై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ఆవరణలో గోరంట్ల మాధవ్ తనపై దుర్భాషలాడారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా రోజూ మీడియా సమావేశాలు పెట్టడం ఆపకపోతే అంతు చూస్తానని గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని రఘురామ కృష్ణరాజు స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై బెదిరింపులకు పాల్పడిన గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు స్పీకర్ ను కోరారు.

Tags:    

Similar News