జగన్ చుట్టూ చీడపురుగులు

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ను ఎందుకు అకస్మాత్తుగా బదిలీ చేయాల్సి వచ్చిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. దేవినేని ఉమకు ప్రాణహాని ఉందన్నారు. దేవినేని గదిలో [more]

Update: 2021-07-31 08:00 GMT

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ను ఎందుకు అకస్మాత్తుగా బదిలీ చేయాల్సి వచ్చిందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. దేవినేని ఉమకు ప్రాణహాని ఉందన్నారు. దేవినేని గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని లింక్ ను మెజిస్ట్రేట్ కు ఇవ్వాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. కారులో ఉన్న వ్యక్తిపై హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు దుర్వినియోగం అవుతుందన్నారు. సీఎం జగన్ చుట్టూ చీడపురుగులు చేరాయని, వచ్చే సోమవారం విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో పిటీషన్ వేస్తానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.

Tags:    

Similar News