ఇది ఏకపక్ష నిర్ణయం కాదా జగన్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు [more]

Update: 2021-07-12 03:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు మార్చడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అమ్మ భాషను అదిమేసే చర్యలని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. తెలుగు అకడామీలో సంస్కృతాన్ని చేర్చడం ఏకపక్ష నిర్ణయమని ఆయన అన్నారు. ఈ విష‍యంపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎందుకు నోరు మెదపడం లేదని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని రఘురామ కృష్ణరాజు సూచించారు.

Tags:    

Similar News