మీ ఆలోచనలను కట్టిపెట్టండి… జగన్ కు రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆంగ్ల నిర్ణయం ప్రవేశపెట్టాలన్న [more]

Update: 2021-07-03 03:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆంగ్ల నిర్ణయం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి తెలుగు వాడు బాధపడే విషయమని రఘురామ కృష్ణరాజు అన్నారు. పాఠశాలల్లో అవసరమైన ఇంగ్లీష్ టీచర్లు లేకపోయినా హడావిడిగా ప్రవేశపెట్టడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగుభాషను నాశనం చేయాలన్న మీ ఆలోచనలకు స్వస్తి చెప్పాలని రఘురామ కృష్ణరాజు జగన్ కు రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News