జగనూ…శంకుస్థాపనలు చేయాలి మళ్లీ.. మళ్లీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై ఆయన [more]

Update: 2021-06-29 03:49 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై ఆయన ఈ లేఖ రాశారు. అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు ఇంతవరకూ పేదలకు ఇవ్వలేదని రఘురామ కృష్ణరాజు తన లేఖలో ప్రశ్నించారు. ఇక పేదలకు ఇళ్ల నిర్మాణానికి తొలుత 56 వేల కోట్లు అంచనా వేశారని, ఇప్పుడు అది 70 వేల కోట్లకు చేరుకుందని, విడతల వారీగా శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే మా చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి అనే డైలాగ్ గుర్తుకు వస్తుందని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. పక్కా ఇళ్లపై మన పార్టీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. బెడ్ రూం వైశాల్యం పెంచితే బాగుంటుందని రఘురామ కృష్ణరాజు సూచించారు.

Tags:    

Similar News