బ్రేకింగ్ : జగన్ బతిమాలితే వచ్చా.. ఆయన దయాదాక్షిణ్యం కాదు

తన కాళ్లా వేళ్లా పడితేనే తాను వైసీపీలోకి వచ్చానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రసాదరాజు [more]

Update: 2020-06-15 07:54 GMT

తన కాళ్లా వేళ్లా పడితేనే తాను వైసీపీలోకి వచ్చానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రసాదరాజు చేత ఎవరు తనపై మాట్లాడించారో తెలుసునన్నారు. తనను పోటీ చేయమని బతిమాలితేనే పోటీ చేశానన్నారు. తనవల్ల అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అప్పుడు చెప్పారన్నారు. తాను సీటు అడిగానో, బతిమాలితో వచ్చానో ప్రసాదరాజుకు తెలుసునన్నారు. తాను కాబట్టే ఇక్కడ గెలిచానని రఘురామకృష్ణం రాజు అన్నారు. తనకు పార్లమెంటు కమిటీ ఛైర్మన్ దక్కడంలో కేవలం జగన్ దయాదాక్షిణ్యాల వల్లనే రాలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనపై విమర్శలు చేసినందుకు ప్రసాదరాజుకు మంత్రి పదవి దక్కుతుందన్నారు.

Tags:    

Similar News