రాజు కాలికి గాయంపై హైకోర్టు సీరియస్

రఘురామ కృష్ణంరాజు కాలిగాయంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది. కస్టడీ లో ఉన్న వ్యక్తులకు ఎలా దెబ్బలు తగులుతాయని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయని, [more]

Update: 2021-05-15 14:18 GMT

రఘురామ కృష్ణంరాజు కాలిగాయంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది. కస్టడీ లో ఉన్న వ్యక్తులకు ఎలా దెబ్బలు తగులుతాయని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయని, బాధ్యులపై చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది. రఘరామ కృష్ణంరాజు కాలి గాయంపై మెడికల్ రిపోర్ట్ ను సమర్పించాలని కోరింది. ఇందుకు ముగ్గురు డాక్టర్లతో కూడిన మెడికల్ బృందాన్ని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏర్పాటు చేసింది. అరగంటలోపు ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణలో వాదనలు ముగిశాయి.

Tags:    

Similar News