పినరయి విజయన్ మోడీ సమావేశానికి?

ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. లాక్ డౌన్ సడలింపు, కొనసాగింపులపై చర్చిస్తున్నారు. కరోనా వ్యాప్తి పై కూడా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. [more]

Update: 2020-04-27 06:09 GMT

ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. లాక్ డౌన్ సడలింపు, కొనసాగింపులపై చర్చిస్తున్నారు. కరోనా వ్యాప్తి పై కూడా నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకాలేదు. ఇప్పటికే తాము సూచనలు, రాష్ట్ర పరిస్థితిని నివేదిక రూపంలో అందించామని ప్రధాని కార్యాలయానికి కేరళ ప్రభుత్వం తెలిపింది. కాగా మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు హాజరయ్యారు.

Tags:    

Similar News