ఇంకా ఇబ్బంది పెడుతున్నారు

మీడియా, పోలీసుల సహకారంతోనే తాము కుటుంబం ఈ రోజుకు బ్రతికి ఉన్నామని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. హైదరాబాద్ హైదర్ గూడ [more]

Update: 2019-02-01 11:45 GMT

మీడియా, పోలీసుల సహకారంతోనే తాము కుటుంబం ఈ రోజుకు బ్రతికి ఉన్నామని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత నెల 30న అమృతకు మగబిడ్డ జన్మించాడని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు . ప్రణయ్, అమృత పెళ్లిరోజు నాడే బాబు జన్మించడం సంతోషంగా ఉందని… ఈ సమయంలో ప్రణయ్ ఉంటే బాగుండునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమృత కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమను వేధిస్తున్నారని… ఎందుకు మమ్మల్ని ఇబందులు పెడుతున్నారో తమకు అర్ధం కావడం లేదని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. మా ప్రాణం పోయినా న్యాయపోరాటం చేస్తామని… ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడిన దోషులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అమృత, బాబుకు ఆర్థికంగా, భద్రతపరంగా సహకారం అందిస్తామని వారు తెలిపారు.

Tags:    

Similar News