ఎవరూ ఓటింగ్ కు రావడం లేదే?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఇష్టపడటం [more]

Update: 2020-12-01 07:46 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఇష్టపడటం లేదు. కరోనా కారణంగా కొందరు బ్యాలట్ పత్రాల ఓటింగ్ కు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. అందుకే చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుండటం రాజకీయ పార్టీల్లో ఆందోళన ప్రారంభమయింది. దీంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించేందుకు పార్టీల కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఓల్డ్ మలక్ పేట్ పోలింగ్ రద్దు కావడంతో ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

Tags:    

Similar News