పల్లా శ్రీనివాస్ దీక్ష ను భగ్నం చేసిన పోలీసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా [more]

Update: 2021-02-16 02:02 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్షను చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు పల్లా శ్రీనివాస్ ను పరామర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

Tags:    

Similar News