శిబిరం ఖాళీ చేస్తున్నపోలీసులు

గుంటూరులో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తున్న వైసీపీ బాధిత శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరులోని బాధిత శిబిరం వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. శిబిరంలో [more]

Update: 2019-09-11 08:11 GMT

గుంటూరులో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తున్న వైసీపీ బాధిత శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరులోని బాధిత శిబిరం వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. శిబిరంలో తలదాచుకుంటున్న వారిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శిబిరం నుంచి టీడీపీ నేతలను బయటకు పంపించి వేశారు. శిబిరం ఖాళీ అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, టెన్షన్ తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News