బ్రేకింగ్ : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. ఆయన జనవరి 8న ఏపీలో పర్యటించాల్సి ఉంది. గుంటూరులో బీజేపీ సభలో ఆయన పాల్గొనాలి. కానీ, [more]

Update: 2018-12-28 09:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. ఆయన జనవరి 8న ఏపీలో పర్యటించాల్సి ఉంది. గుంటూరులో బీజేపీ సభలో ఆయన పాల్గొనాలి. కానీ, ఆయన పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకుని సంక్రాంతి తర్వాత పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో లోగా ఆయన ఏకంగా మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ టూర్ పై రాష్ట్ర బీజేపీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందని టీడీపీ చేస్తున్న విమర్శలకు మోదీ కౌంటర్ ఇస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News