రాజధానిపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పెద్దిరిడ్డి రామచంద్రారెడ్డి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని తాము తాత్కాలికగంగానే భావించినట్లు ఆయన చెప్పారు. అమరావతిని తాత్కాలిక రాజధానిగానే చంద్రబాబు కూడా [more]

Update: 2019-12-20 03:21 GMT

మంత్రి పెద్దిరిడ్డి రామచంద్రారెడ్డి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని తాము తాత్కాలికగంగానే భావించినట్లు ఆయన చెప్పారు. అమరావతిని తాత్కాలిక రాజధానిగానే చంద్రబాబు కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. రాజధాని మూడు చోట్ల కాకుంటే 30 చోట్ల కడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని వారికి వెనక్కు ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. రాజధానులకు కేంద్రం అనుమతులు అసవరం లేదని తెలిపారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. తాము విశాఖలో భూుముల కొన్నామనడం సరికాదని, ఇప్పటికే విశాఖలో భూముల ధరలు పెరిగాయన్నారు పెద్దిరెడ్డి.

Tags:    

Similar News