Peddireddy : కుక్కలన్నావుగా.. లెక్కలు చూస్తావులే?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ [more]

Update: 2021-11-13 07:35 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ వైసీపీ నేతలను కుక్కలు, గాడిదలంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ తాము లోకేష్ వ్యాఖ్యలకు స్పందించబోమన్నారు. ఎవరు కుక్కలో ఈ నెల 17వ తేదీన లెక్కలు చెబుతాయని ఆయన అన్నారు. 17న కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజయం ఖాయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అప్పుడు కుక్కలెవరో లెక్కలు చెబుతాయని అన్నారు.

Tags:    

Similar News