peddireddy : బాబూ ఇక రిటైర్ అయిపో

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుట్రపూరితంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని చూశారన్నారు. నిమ్మగడ్డ [more]

Update: 2021-09-19 12:20 GMT

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుట్రపూరితంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని చూశారన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక సామాజికవర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా రాజకీయంగా పదవీ విరమణ చేయాలని, హైదరాబాద్ లో ఉండి ప్రజలకు సేవ చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Tags:    

Similar News