ఎంపీ కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

తమ పార్లమెంటు సభ్యుడు కన్పించడం లేదంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కనపడటం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బెల్లంపల్లి చౌరస్తా [more]

Update: 2021-04-11 01:18 GMT

తమ పార్లమెంటు సభ్యుడు కన్పించడం లేదంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కనపడటం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఎంపీ ఫొటో పెట్టుకుని ర్యాలీ గా వెళ్లి మరరీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి వెంకటేశ్ కన్పించడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

Tags:    

Similar News