మీరు ఆపుతారా.. మమ్మల్నే ఆపమంటారా..?

Update: 2018-08-06 08:32 GMT

కర్నూలు జిల్లా హత్తిబెళగళ్ లో జరిగిన క్వారీ ప్రమాద ఘటన స్థలాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పేలుడు ధాటికి పగుళ్లొచ్చిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్వారీ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమయ్యే క్వారీలపై చర్యలు తీసుకోకపోతే, జనసేన కార్యకర్తలే క్వారీలను మూసివేస్తారని హెచ్చరించారు. క్వారీల్లో ప్రమాదాలు జరుగుతుంటే గనుల శాఖ మంత్రి నిద్రపోతున్నారా.? అని ప్రశ్నించారు.

అభిమానుల వల్ల ఐదు నిమిషాలే..

కర్నూలు క్వారీ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు పవన్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో తోపులాట జరిగింది. అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పవన్ ను చుట్టుముట్టారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి పవన్ వెనుదిరిగారు.

Similar News