బాబుకు పవన్ 48 గంటల సమయం

Update: 2018-05-23 06:50 GMT

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై 48 గంటల్లో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే యాత్ర ఆపి ఒక రోజు దీక్షకు దిగుతానని జనపేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం పలాసలో కిడ్నీ బాధితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం వద్ద లక్షల కోట్ల డబ్బున్నా కిడ్నీ సమస్య పరిష్కరించడం లేదన్నారు. అమెరికా వైద్యులు ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఈ సమస్యపై ప్రశ్నించేందుకు కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేడన్నారు. ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో కిడ్నీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే యాత్ర ఆపి ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆరోగ్య శాఖ మంత్రిని కూడా వెంటనే నియమించాలని పవన్ డిమాండ్ చేశారు.

Similar News