ఏపీ లో ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించండి

ఆంధ్రప్రదేశ్ లోని గొల్లవిల్లి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గొల్లవిల్లి గ్రామంలో నలభై శాతం మంది ప్రజలు కరోనా [more]

Update: 2021-05-13 01:06 GMT

ఆంధ్రప్రదేశ్ లోని గొల్లవిల్లి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గొల్లవిల్లి గ్రామంలో నలభై శాతం మంది ప్రజలు కరోనా బారిన పడ్డారన్నారు. ఐదువేల మంది జనాభా ఉన్న ఈగ్రామంలో ఇప్పటికే 20 మంది కరోనాతో మరణించారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే గొల్లవిల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి, వైద్య సహాయం అందజేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

Tags:    

Similar News