పవన్ భావోద్వేగం.. రెండు లక్షలు ఇస్తానని ప్రకటన

తన అభిమానుల మృతి పట్ల పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. జనసైనికుల మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు [more]

Update: 2020-09-02 02:55 GMT

తన అభిమానుల మృతి పట్ల పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. జనసైనికుల మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు. పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో ఫ్లెక్సీలు కడుతుండగా ముగ్గురు మరణించారు. వీరిని సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. 25 అడుగుల ఎత్తులో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్ కు గురై మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News