స్టైరిన్ తో కూడా సహజీవనం చేయాల్సి ఉంటుందేమో?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు తమ ఆస్తులను మాత్రం పెంచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. [more]

Update: 2020-05-18 02:27 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు తమ ఆస్తులను మాత్రం పెంచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడ ఉన్న జలవనరులను వినియోగించుకుంటే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తమ ఆస్తులను పెంచుకోవడంపై ఉన్న శ్రద్థను వైసీపీ నేతలు ఉత్తరాంధ్రపై ఉంచడం లేదన్నారు. కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిందేనని చెప్పిన ప్రభుత్వం వెంకటాపురం ప్రజలు స్టైరిన్ తో కూడా సహజీవనం చేయమని చెబుతారేమో అని సెటైర్ విసిరారు. ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Tags:    

Similar News