తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిందే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జగన్ పాలనపై ఫైరయ్యారు. సమర్థత లేకుంటే తిరిగి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. పాలించే సత్తా లేనప్పుడు తిరిగి [more]

Update: 2019-12-03 07:55 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జగన్ పాలనపై ఫైరయ్యారు. సమర్థత లేకుంటే తిరిగి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. పాలించే సత్తా లేనప్పుడు తిరిగి ఎన్నికలకు వెళ్లడమే మంచిదని పవన్ కల్యాణ‌్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని రైతు బజారును సందర్శించిన పవన్ కల్యాణ‌్ ఉల్లి రైతులతో మాట్లాడారు. ఉల్లి ధరలు అమాంతంగా పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పారు. ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ‌్ ప్రశ్నించారు. పగులకొట్టడం, రద్దు చేయడమే జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకే తిరిగి ఎన్నికలకు వెళ్లాలని పవన్ కల్యాణ్ కోరారు.

Tags:    

Similar News