వైసీపీపై పవన్ కళ్యాణ్ కామెంట్స్

Update: 2018-06-27 10:31 GMT

గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని టీడీపీ ప్రచారం చేసిందని, కానీ, టీడీపీ వాళ్లే విశాఖలో లక్ష ఎకరాలు కబ్జా చేయడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై బుధవారం మేధావులతో సమావేశమైన పవన్ అనంతరం మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారి తీసేలా ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కాకముందే సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన వారికి ఒక ఎకరం చొప్పున భూమి కొనిస్తానని హామీ ఇచ్చారు. తన ఉత్తరాంధ్ర పర్యటనతో సీఎం ఉద్రేకంగా ఉన్నారని, ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నాని చంద్రబాబు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఉంది కానీ నాయకులు లేరని, స్థానికంగా న్యాయం చేసేవాడికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానని స్పష్టం చేశారు. తెలంగాణకు వలస వెళ్లిన 26 కులాలను స్థానికులుగా గుర్తించాలని కేసీఆర్ ను కోరతానని పేర్కొన్నారు.

Similar News