ఈ పవన్ ఉన్నాడే...!

Update: 2018-04-24 13:19 GMT

పవన్ కల్యాణ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశమయిన చంద్రబాబు పవన్ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఎటువంటి ఆధారాలు లేకుండా పార్టీపైనా, నాయకులపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించినట్లుతెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు అన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ నెల 30 వతేదీన తిరుపతిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై చంద్రబాబు నేతలతో చర్చించారు. అంతేకాకుండా అదేరోజు తిరుపతితో మేధావులతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. గవర్నర్ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. వైసీపీ, పవన్ వెనుక బీజేపీ ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా నేతలకు చంద్రబాబు సూచించారు.

Similar News