జ‌గ‌న్ క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు

ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు వైఎస్ జ‌గ‌న్ క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి [more]

Update: 2019-05-10 07:11 GMT

ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు వైఎస్ జ‌గ‌న్ క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి వ‌స్తామ‌ని జ‌గ‌న్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని, వైసీపీ దురాలోచ‌న‌కు మే 23న ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని జోస్యం చెప్పారు. ఎన్నిక‌ల కోడ్ తో ఎన్నిక‌ల సంఘం ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని పేర్కొన్నారు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎన్నిక‌ల కోడ్ ను స‌వ‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం అవ‌లంభిస్తున్న తీరును ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌మీక్ష చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News