ప్రారంభమయిన పరిషత్ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 515 జడ్పీటీసీ స్థానాలకు, 7,220 ఎంపీీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 2,058 మంది అభ్యర్థులు [more]

Update: 2021-04-08 02:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 515 జడ్పీటీసీ స్థానాలకు, 7,220 ఎంపీీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 2,058 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈరోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతంది. ఇందుకోసం రాష్ట్రంలో 27,751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారుల గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News