తెలంగాణను తగులుకుని వదలడం లేదు… ఒక్క రోజులోనే?

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆగడం లేదు. నిన్న ఒక్క రోజే 52 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 33 కేసులు హైదరాబాద్ లోనివే. [more]

Update: 2020-05-24 02:34 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆగడం లేదు. నిన్న ఒక్క రోజే 52 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 33 కేసులు హైదరాబాద్ లోనివే. 15 కేసులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు కాగా నలుగురు కువైట్ నుంచి వచ్చిన వారికి కరోనా పాజటివ్ గా తేలింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1813కు చేరుకుంది. కరోనా కారణంగా తెలంగాణలో 49 మంది చనిపోయారు. నిన్న ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 1068 మంది డిశ్చార్జ్ కాగా, 696 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వీరిలో వలస కార్మికులే ఎక్కువగా ఉన్నారు.

Tags:    

Similar News