భారత్ లో పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 17,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది కరోనాతో మరణించారు. [more]

Update: 2021-03-10 04:57 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 17,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,62,707 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,58,060 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,598 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,09,20,046 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News