చెప్పేదేమీ లేదు.. గవర్నర్ తో 45 నిమిషాలు భేటీ

ఏపీ గవర్నర్ తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలు పాటు రమేష్ కుమార్ గవర్న్ తో సమావేశమయ్యారు. ఎన్నికల [more]

Update: 2020-03-16 06:37 GMT

ఏపీ గవర్నర్ తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలు పాటు రమేష్ కుమార్ గవర్న్ తో సమావేశమయ్యారు. ఎన్నికల వాయిదాకు గల కారణాలను పూర్తి స్థాయిలో గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించినట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ తో సమావేశం ముగిసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడలేదు. ఏదైనా సమాచారం ఉంటే తాను మీడియాకు, ప్రజలకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు కూడా గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News