నిమ్మగడ్డ యాప్ పై నేడు హైకోర్టులో

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించిన ఈ-వాచ్ యాప్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ యాప్ ను ఎటువంటి భద్రత లేకుండా వినియోగం లోకి తెచ్చారంటూ [more]

Update: 2021-02-09 01:31 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించిన ఈ-వాచ్ యాప్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ యాప్ ను ఎటువంటి భద్రత లేకుండా వినియోగం లోకి తెచ్చారంటూ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీ వరకూ యాప్ ను వినియోగించవద్దని హైకోర్టు పేర్కొంది. అయితే భద్రతపరమైన అనుమతిని ప్రభుత్వం నుంచి పొందాల్సి ఉంది. అనుమతి పత్రాన్ని ఐదు రోజుల్లో సమర్పిస్తామని నిమ్మగడ్డ తరుపున న్యాయవాది తెలిపారు. నేడు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

Tags:    

Similar News