నేడు రాయలసీమలో నిమ్మగడ్డ పర్యటన

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాయలసీమలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకోనున్నారు. ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో నిమ్మగడ్డ పర్యటించి [more]

Update: 2021-01-29 01:08 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు రాయలసీమలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకోనున్నారు. ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో నిమ్మగడ్డ పర్యటించి అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం కర్నూలు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష చేస్తారు. రేపు కడప జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుందన్న దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో సమావేశం కానున్నారు.

Tags:    

Similar News