బ్రేకింగ్ : భారత్ లో కొత్త కరోనా కలకలం

భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తుంది. కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త కరోనా కేసులు భారత్ లో 25కు చేరుకుంది. భారత్ [more]

Update: 2020-12-31 05:49 GMT

భారత్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తుంది. కొత్తగా ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త కరోనా కేసులు భారత్ లో 25కు చేరుకుంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 21,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 299 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,66,674 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,48,738 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,57,656 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 98,34,141 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News