ఎన్.డి.తివారి కొడుకుది హ‌త్య‌…!

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖ‌ర్‌ మ‌ర‌ణంపై సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, [more]

Update: 2019-04-19 12:35 GMT

ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖ‌ర్‌ మ‌ర‌ణంపై సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, హ‌త్య చేసిన‌ట్లు పోస్టు మార్టంలో తేలింది. దిండుతో ఆయ‌న‌కు ఊపిరి ఆడ‌కుండా చేసి హ‌త్య చేశార‌ని పోస్టుమార్టంలో తేలింది. అయితే, ఆయ‌న‌ను ఎవ‌రు హ‌త్య చేశార‌నేది తేలాల్సి ఉంది. రోహిత్ మ‌ర‌ణంపై హ‌త్య‌కేసు న‌మోదు చేసిన పోలీసులు క్రైమ్ బ్రాంచ్ కు బ‌దిలీ చేసి ధ‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, రోహిత్ హ‌త్య వెనుక కుటుంబ‌స‌భ్యుల పాత్ర ఉందా అనే కోణంలో ధ‌ర్యాప్తు చేస్తున్నారు. గ‌తంలో ఎన్డీ తివారి త‌న తండ్రి కోర్టులో కొట్లాడి మ‌రీ నిరూపించుకున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News